యావత్ సినీ లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.అయితే అది ఖచ్చితంగా రిలీజ్ అవుతుందా లేదా అనే విషయాన్ని పక్కనబెడితే, ప్రస్తుతం ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉక్రెయిన్లో షూటింగ్లో పాల్గొంటున్నారు.
ఇక ఈ సినిమా తరువాత తమ నెక్ట్స్ ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు ఈ ఇద్దరు టాప్ హీరోలు.
అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే తన కెరీర్లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
కాగా ఈ మధ్యలో ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే టీవీ గేమ్ షోను హోస్ట్ చేయనున్నాడు.దీంతో ఈ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ షోను ఆగస్టు 22న కర్టైన్ రైజర్ ద్వారా ప్రారంభించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.కాగా ఈ కర్టైన్ రైజర్ షోను మరింత స్పెషల్గా చేసేందుకు వారు తొలి చీఫ్ గెస్ట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను ఆహ్వానించారు.
ఆర్ఆర్ఆర్లో కలిసి నటిస్తున్న ఇద్దరు హీరోలు ఇప్పుడు బుల్లితెరపై ఒకేసారి సందడి చేయనుండటంతో మెగా, నందమూరి అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
ఈ గేమ్ షోలో వారిద్దరు ఎలాంటి విషయాలు పంచుకుంటారు, వారిద్దరు ఎలా ఉంటారు అనే అంశాలకు సంబంధించి ఓ చిన్న టీజర్ను నిర్వాహకులు రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ ప్రోమో టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.మొత్తానికి కర్టైన్ రైజర్తోనే ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్కు కావాల్సినంత బూస్ట్ను ఇచ్చేయనున్నాడు తారక్.
ఇక ఆ రోజు ఈ షో టీఆర్పీ రేటింగ్స్ ఎక్కడికి వెళ్లిపోతాయో అంచనా వేయడం ఇప్పుడే కష్టం అంటున్నారు విశ్లేషకులు.