యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
గతంలో త్రివిక్రమ్-తారక్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్ మూవీగా నిలిచింది.దీంతో ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో మరోసారి ఈ కాంబో ప్రేక్షకులు మందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
కాగా ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్గా లాంఛ్ కూడా చేశారు.అయితే ఈసారి తారక్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథను పట్టుకొస్తాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఈసారి తారక్ కోసం త్రివిక్రమ్ ఓ పొలిటికల్ ఎంటర్టైనర్ను తీసుకొస్తున్నాడని, ఇది పల్నాడులో జరిగే కథగా చిత్ర యూనిట్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
పల్నాడులో జరిగే కథను పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా త్రివిక్రమ్ తనదైన మార్క్తో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో తారక్ ఓ సరికొత్త లుక్లో కనిపిస్తాడని తెలుస్తోంది.కాగా ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.