యంగ్ టైగర్.టాలీవుడ్ లో అత్యధిక మార్కెట్ వున్న అగ్ర కథానాయకులలో ఈయన ఒకరు.
ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే పండగ.ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటారు.
ప్రస్తుతం ఈయన RRR అనే భారీ ప్రాజెక్ట్లో కొమురం భీం పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.కాగా కరోనా వలన ఈ సినిమా షూటింగ్ కు బ్రేకు పడింది.
ఐతే ఇందులో అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్ టీజర్ ఆమధ్య రిలీజు అయింది.దాంతో చరణ్ అభిమానులు ఖుషీ అయ్యారు.
ఇక అలాగే… ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ కూడా రిలీజు చేస్తాడు అని నమ్మిన ఎన్టీఆర్ అభిమానులకు రాజమౌళి షాకిచ్చాడు.దాన్ని మంచి తరుణం చూసి వదులుతా అన్నాడు జక్కన్న.
ఇకపోతే.మరి కొద్ది రోజులలో RRR తిరిగి షూటింగ్ మొదలు కానుండగా, వీలైనంత త్వరగా తన పార్ట్ కంప్లీట్ చేసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే తర్వాత త్రివిక్రమ్ లైన్ లో వున్నాడు మరి!
ఇకపోతే.రాజమౌళి తీర్చని కోర్కెను త్రివిక్రమ్ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.అందుకనే నెక్స్ట్ మొదలు కాబోతున్న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోకు సంబంధించి ఏదైన అప్డేట్ ఇవ్వమంటూ.అభిమానులు, ఎన్టీఆర్ నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలలో ఒకరైన నాగవంశీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.“షూటింగ్ స్టార్ట్ అవ్వగానే, ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ వెల్లడిస్తాం.అంతేగాని షూట్ కు ముందు ఎట్టి పరిస్థితులలోను రివీల్ చేయవద్దని మాకో సెంటిమెంట్ ఉంది.” అని ఝలక్ ఇచ్చాడు.