యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు తారక్ రెడీ అయ్యాడు.
ఈ మేరకు చిత్ర అనౌన్స్మెంట్ కూడా జరిగింది.ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఎంచుకున్న కథ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమా నుండి తీసుకున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడు అనే సినిమా కథ నుండి స్పూర్తి పోంది ఈ సినిమా కథను త్రివిక్రమ్ రాసినట్లు సోషల్ మీడియా కోడై కూసింది.దీంతో ఈ వార్త చిత్ర యూనిట్ వరకు చేరగా, వారు ఈ వార్తలను ఖండించారు.
ఇదంతా కేవలం పుకార్లేనని, చిరు సినిమాతో ఈ సినిమాకు సంబంధం ఉండదని వారు తెలిపారు.తారక్ కోసం త్రివిక్రమ్ ఓ అదిరిపోయే కథను రెడీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కథ ఇంకా పూర్తి కాలేదని, అయిన వెంటనే చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారని చిత్ర వర్గాలు తెలిపాయి.
ఇక ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
తారక్ను మరింత పవర్ఫుల్గా చూపించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందనను ఎంపిక చేశారు చిత్ర యూనిట్.
ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్, రాధాకృష్ణలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నారు.