టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని చూస్తున్న హిరణ్యకశిప చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.యంగ్ హీరో రానా దగ్గుబాటి లీడ్ రోల్లో నటించబోయే ఈ సినిమా స్క్రిప్టు పనులు ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు గుణశేఖర్ రెడీ అవుతున్నాడు.
పూర్తి మైథలాజికల్ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాలో ఓ స్టార్ హీరోను తీసుకోవాలని గుణశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హిరణ్యకశిపుడి పాత్రలో రానా పర్ఫెక్ట్గా సరిపోతాడని ఫిక్స్ అయిన గుణశేఖర్, ఆయనకు ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ చిత్రాన్ని ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఇక హిరణ్యకశిపుడి కథ విష్ణు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.ఆ పాత్రలో ఎవరిని తీసుకోవాలా అని గుణశేఖర్ చాలాకాలంగా ఆలోచిస్తూ వచ్చాడు.అయితే టాలీవుడ్లో మైథాలజీ పాత్రలు చేయడంలో ప్రస్తుతం ఉన్న హీరోల్లో జూ.ఎన్టీఆర్ అయితే ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలడని గుణశేఖర్ భావిస్తున్నాడు.
అందుకే ఈ సినిమాలో విష్ణు పాత్రలో జూ.ఎన్టీఆర్ను తీసుకోవాలని గుణశేఖర్ ఫిక్స్ అయ్యాడు.ఇక ఈ విషయాలను గుణశేఖర్ తాజాగా అభిమానులతో పంచుకోవడంతో ప్రస్తుతం హిరణ్యకశిపుడు సినిమా గురించి ప్రేక్షకులు తెగ చర్చించుకుంటున్నారు.మరి ఈ సినిమా ఎప్పుడు మొదలువుతుందా, ఇంతకీ ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తారా లేదా అనేది కూడా హాట్ టాపిక్గా మారింది.