ఎన్టీఆర్, సుకుమార్ల కాంబినేషన్లో ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నాడు.
భారీ అంచనాలున్న ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు విచ్చలవిడిగా ఖర్చు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.
లండన్లో ఈ సినిమా కోసం 60 లక్షలు పెట్టి ఒక కార్పోరేట్ ఆఫీస్ సెట్ను వేయించారు.తెలుగు సినిమా కోసం విదేశాల్లో సెట్టింగ్స్ వేయించడం అనేది ఇదే ప్రధమం.
ఇంత ఖర్చు చేయిస్తున్న సుకుమార్ గత చిత్రం ‘1’ ఫ్లాప్ అనే విషయం తెల్సిందే.
మహేష్బాబుతో తెరకెక్కించిన ‘1’ చిత్రాన్ని కూడా గొప్పలు పోయి సుకుమార్ చాలా ఖరీదుగా తెరకెక్కించాడు.
ఎక్కువ శాతం విదేశాల్లోనే ఆ సినిమా తెరకెక్కింది.మళ్లీ ఇప్పుడు సైతం అదే దారిలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కూడా ఎక్కువగా విదేశాల్లోనే తెరకెక్కుతూ భారీ బడ్జెట్తో రూపొందుతుంది.
గత సినిమా అనుభవంతో అయినా సుకుమార్ ఈ సారి కాస్త తగ్గాల్సిందని, అలా కాకుండా దర్శకుడు ఇలా అతి చేయడం నిర్మాతకు మంచిది కాదు అని కొందరు సినీ ప్రముఖులు అంటున్నారు.మరి సుకుమార్ చేస్తున్న ఈ అతి ప్రేక్షకులకు నచ్చి, నిర్మాతకు లాభాలు తెచ్చి పెడుతుందా లేక, నిర్మాతను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తుందా అనేది చూడాలి.