సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతల ఇళ్లపై లేక పేరుమోసిన బిజినెస్మెన్లపై ఐటి రైడ్స్ జరుగుతుంటాయి.ఎప్పుడు ఎవరు తప్పుడు లెక్కలు చూపిస్తారా అని వారు ఈ రైడ్స్ చేస్తుంటారు.
తాజాగా జరిగిన ఓ ఐటి రైడ్ ఓ తెలుగు స్టార్ హీరోను షాక్కు గురిచేసింది.ఐటి అధికారులు దాడి చేసింది ఎవరిపైనో కాదు మరి.స్వయాన జూ ఎన్టీఆర్ మామ అయిన నార్నె శ్రీనివాస రావుపై.అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ అధికారులు నార్నె శ్రీనివాసరావుపై ఐటి రైడ్లు నిర్వహించడంతో ఒక్కాసారిగా తారక్ అవాక్కయ్యాడు.
హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించాడు.నార్నె శ్రీనివాసరావుకు చెందిన స్టూడియో ఎన్ ఛానల్ మరియు ఇతర ఆస్తులపై ఈ రైడ్లు నిర్వహించారు.
నార్నె ఆస్తులకు సంబంధించి అన్ని పత్రాలు సరిగా ఉండటంతో ఐటి అధికారులు వెనుదిరిగారు.ఇలా తన మామపై ఐటీ దాడులు జరగడంతో తారక్ ఒక్కసారిగా అవాక్కయ్యాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇక సినిమాల విషయానికి వస్తే తారక్ ప్రస్తుతం ప్రెస్టీజియస్ RRR సినిమాలో చేస్తోన్న సంగతి విదితమే.