సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరి దర్శకత్వంలో సినిమాలు తెరకెక్కుతున్నాయంటే ఆ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ దర్శకులు ఇద్దరూ ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.రాజమౌళి RRR షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటుండగా కొరటాల శివ ఆచార్య పూర్తి చేసుకున్నారు.
ఈ సినిమాలో షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈ స్టార్ డైరెక్టర్స్ బుల్లితెరపై సందడి చేశారు.
బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వరుడు ఈ కార్యక్రమానికి ఈ లెజెండరీ డైరెక్టర్ వచ్చారు.
ఈ క్రమంలోనే హాట్ సీట్లో కూర్చుని ఉన్నటువంటి ఎన్టీఆర్ ను చిలిపిగా ఆట పట్టించారు.ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన ఈ డైరెక్టర్స్ ఈ కార్యక్రమంలో గెలుచుకున్న డబ్బులు మొత్తం చారిటీ ట్రస్ట్ కి ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు.
ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరిని ఎన్టీఆర్ వివిధ రకాల ప్రశ్నలు అడగడం తో ఎంతో చాకచక్యంగా సమాధానాలు చెప్పారు.
మరి ఈ దర్శకులు ఇద్దరూ ఈ కార్యక్రమంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఎంత గెలుచుకున్నారు అనే విషయానికి వస్తే.ఈ డైరెక్టర్స్ ఇద్దరు వారి మేధా శక్తిని ఉపయోగించి ఏకంగా 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు.ఎంతో చాకచక్యంగా ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.
ఈ డైరెక్టర్లు ఇద్దరు 25 లక్షల రూపాయల గెలుచుకున్నారు.ఇలా ఇరవై ఐదు లక్షల గెలుచుకునే సరికి ఈ ఇద్దరు డైరెక్టర్లు ఆనందంలో మునిగిపోయి ఎన్టీఆర్ తో కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు.
ఇలా మాట్లాడుతున్న క్రమంలోనే శంఖం మోగడంతో ఆట పూర్తయిందని ఎన్టీఆర్ 25 లక్షల రూపాయల చెక్కును వారికి అందించారు.