హిందీలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్నకౌన్ బనేగా కరోడ్ పతిఎంత పాపులరో అందరికీ తెలిసిందే.ఇప్పుడు అలాంటి షోనే తెలుగు టెలివిజన్ లో ప్రారంభమైంది.
ఈ మధ్యే మొదలైన ఈ కార్యక్రమానికి వ్యక్తిగా .యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ప్రారంభ ఎపిసోడ్ ను కాస్త విభిన్నంగా, ప్రత్యేకంగా తీర్దిదిద్దడంతో.ఈ షో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులకు ఎంతో ఎదురు చూశారు.మొదటి ఎపిసోడ్ లో నటుడు రామ్ చరణ్, తారక్ లు స్టేజ్ ని పంచుకోవడం ఈ షో పై అంచనాలు భారీగా పెరిగాయి.ఈ ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలతో రూపుదిద్దుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీ మరి కొద్దిరోజుల్లో విడుదల కానున్న అందరికీ తెలిసిన విషయమే.
అలా ప్రారంభమైన ఎవరు మీలో కోటీశ్వరుడు షో భారీ టీఅర్పీతో దూసుకు పోతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా.వ్యాఖ్యాత అడిగే ప్రశ్నలకు వచ్చిన కంటెస్టెంట్ సమాధానాలు చెప్పాలి.ఇలా అడిగే ప్రతీ ప్రశ్నకు.
ఒక్కో అమౌంట్ ని ఫిక్స్ చేస్తారు.ఈ విధంగా కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకొని సమాధానం చెప్పగలిగితే.
ఆ క్యాష్ ప్రైజ్ మొత్తం వారికే ఇచ్చేస్తారు.
రోజు రోజుకీ అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ కార్యక్రమంలో.రోల్ ఓవర్ కంటెస్టెంట్గా గుంటూరుకు చెందిన సునీత హాట్ సీట్పైకి వచ్చారు.అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఇస్తూ .ఆమె 6లక్షల 40వేల రూపాయల క్వచ్చన్ వరకు వచ్చితప్పు సమాధానం చెప్పడంతో.ఆమె ఆటను కొనసాగించలేక 3లక్షల 20 వేలు గెలుచుకొని గేమ్ నుంచి వైదొలిగారు.
ఇక సునీత గేమ్ నుంచి అవుట్ కావడంతో మరోసారి ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ నిర్వహించారు ఎన్టీఆర్.ఈ టాస్క్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన దయాసాగర్.చాలా వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్పైకి వచ్చారు.గత రెండు మూడు రోజులుగా కరెక్ట్ సమాధానాలు చెప్పాను.
కానీ వేగంగా చెప్పలేకపోయానని కంటెస్టెంట్ అన్నారు.ఈ రోజు వేగంగా సమాధానం చెప్పి ఇక్కడికి వచ్చానని దయా చెప్పారు.
గేమ్లోకి వెళ్లడానికి ముందు యంగ్ టైగర్కు సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను స్వయంగా చిత్రించి బహుమతిగా ఇచ్చారు.ఇలా మరో కంటెస్టంట్ తో కోటి రూపాయల కోసం మొదలైన ఈ ఆటలో.40వేల రూపాయల విలువ గల ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పి .కేవలం 10 వేల రూపాయలతో దయా సాగర్ వెనుదిరిగారు.ఆ తర్వాత శంఖం మోగడంతో ఈ గేమ్ అక్కడితో ముగిసిపోయింది.