యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం తెగ కష్టపడుతున్నాడు.ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ ముగియగానే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించాలని జక్కన్న చూస్తున్నాడు.ఈ క్రమంలో తారక్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
కానీ తారక్ మాత్రం ముందు ఆర్ఆర్ఆర్ను ముగించిన తరువాతే త్రివిక్రమ్తో పని మొదలెట్టాలని చూస్తున్నాడట.దీని కోసం తన డేట్లు అన్నీ కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్కు కేటాయించి,ఆ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా ముగించేయాలని చూస్తున్నాడు.
అటు చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు.దీంతో ఇద్దరు హీరోలు కూడా తమ డేట్లను పూర్తిగా ఆర్ఆర్ఆర్కే అంకితం చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుక జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతోంది.బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.