కరోనా ప్రభావం వల్ల చాలా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.చాలామంది వ్యాపారవేత్తలు కోట్లలో నష్టపోతున్నారు.
ఇక చిన్న వ్యాపారుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.కరోనా ప్రభావం, కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ అమల్లో ఉండటంతో చిరు వ్యాపారులకు బిజినెస్ జరక్కపోవడంతో వారు తమ వ్యాపారాలను మూసివేస్తున్నారు.
అయితే కరోనా ప్రభావంతో మిగిలిన వ్యాపారాల లాగే సినిమా పరిశ్రమ కూడా నష్టపోతుంది.థియేటర్లు మూతపడటం, కరోనా ప్రభావం వల్ల షూటింగ్లు ఆగిపోవడం, విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు ఆలస్యంగా విడుదల కానుండటంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
దీంతో నిర్మాతలను ఆదుకునేందుకు చాలామంది హీరోలు ముందుకు వస్తున్నారు.నిర్మాతలకు అండగా నిలిచేందుకు తమ రెమ్యూనరేషన్ని తగ్గించుకుంటున్నారు.
ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ రెమ్యూనరేషన్ని తగ్గించుకోగా, తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన రెమ్యూనరేషన్ను తగ్గించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా వల్ల ఆగిపోయింది.దీంతో నిర్మాతలకు నష్టం జరుగుతుండటంతో వారి ఇబ్బందులను అర్థం చేసుకున్న ఎన్టీఆర్, తాను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మెజారటీ శాతం షూటింగ్ ముగించుకుంది.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లదు.