రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమాతో టాలీవుడ్ లో ఇద్దరి స్టార్ హీరోలను ఒకే సినిమాలో చూపించబోతున్నాడు జక్కన్న.
అయితే మన టాలీవుడ్ లో మొదటి నుండి మల్టీ స్టారర్ సినిమాలు ఫ్యాన్స్ పెద్దగా ఆదరించేవారు కాదు.కానీ ఇప్పుడిప్పుడే మల్టీ స్టారర్ సినిమాలు ప్రేక్షకులు ఆదరించడం మొదలు పెడుతున్నారు.
కానీ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఆదరించిన మల్టీ స్టారర్ సినిమాలలో మన స్టార్ హీరోలు సీనియర్ హీరోలతో కలిసి చేసిన సినిమాలే ఎక్కువుగా ఉన్నాయి.కానీ మొదటిసారి రాజమౌళి ఇద్దరి స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ మీద చూపించ బోతున్నాడు.
దీంతో ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఫ్యాన్ వార్ మొదలయ్యింది.అది కాస్త చిలికిచిలికి గాలివానగా మారింది.
మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.
ఈ పెరియాడికల్ సినిమాను రాజమౌళి ఎలా ప్రజెంట్ చేస్తాడో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా అభిమానుల మధ్య మళ్ళీ ఫ్యాన్ వార్ మొదలయ్యింది.రాజమౌళి గతంలో సూర్య, ఎన్టీఆర్ కాంబోలో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఇదే విషయం మీద ఫ్యాన్ వార్ కు దిగారు.సూర్య స్థానంలో రామ్ చరణ్ ను తీసుకోవడానికి చిరంజీవి దానయ్య ద్వారా లాబీయింగ్ చేసారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటు మెగా ఫ్యాన్స్ కూడా దీనికి సమాధానంగా.సూర్య వరస ప్లాప్స్ లో ఉన్న కారణంగా ఆయన ప్లేస్ లోకి చరణ్ ను తీసుకొచ్చి ఎన్టీఆర్ కు మంచి చేసారని మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సమయంలో ఫ్యాన్స్ ఇలా రచ్చ చేయడం హీరోలకు తలనొప్పిగా మారుతుంది.
చూడాలి చివరకు ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో.