యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఇండస్ట్రీ వర్గాలు చూస్తున్నాయి.
కాగా తారక్ ఆర్ఆర్ఆర్ పూర్తి కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు పచ్చ జెండా ఊపేశాడు.
ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు.ఇక ఈ సినిమా పట్టాలెక్కకముందే, తన నెక్ట్స్ చిత్రాన్ని క్యూలో పెట్టే పనిలో పడ్డాడు తారక్.ఈ క్రమంలో కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు తారక్.ఈ క్రమంలో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ను చిత్ర నిర్మాణ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.ఈ సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్ను వారు కేటాయించారనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.తారక్ను చాలా పవర్ఫుల్గా చూపించేందుకు ప్రశాంత్ నీల్ అదిరిపోయే కథను రెడీ చేశాడనే వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఆసక్తిని క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాను 2021 ద్వితీయార్ధంలో పట్టాలెక్కించేందుకు తారక్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.మరి తారక్ కోసం ఇంత బడ్జెట్ కేటాయించడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.