యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో తారక్ నటిస్తుండటంతో వేరే ఏ సినిమాను కూడా చేయలేదు.
దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా తారక్ మాత్రం ఆర్ఆర్ఆర్ తరువాత వరుసబెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తన 30వ చిత్రాన్ని ప్రారంభించిన తారక్, ఆ తరువాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.పవర్ఫుల్ సినిమాగా రానున్న ఈ సినిమాకు టైటిల్ ఇదేనంటూ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
కేజీఎఫ్ లాంటి పవర్ఫుల్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్, అంతకంటే పవర్ఫుల్ ఎన్టీఆర్తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాకు న్యూక్లియర్ లేదా మిసైల్ అనే టైటిల్ను పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఈ రెండు టైటిల్స్ కూడా ఈ సినిమాకు పెట్టబోరని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాకు ‘ఆటం బాంబ్’ అనే మరింత పవర్ఫుల్ టైటిల్ను పెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్ కూడా బాంబ్ పేలినట్లు పేలనుందని, అందుకే ఈ సినిమాకు ఇలాంటి పవర్ఫుల్ టైటిల్ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
మొత్తానికి తారక్తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో ఇప్పుడే ప్రేక్షకులకు ఓ క్లూ ఇచ్చేస్తున్నాయి చిత్ర వర్గాలు.ఇక ఈ సినిమాను ఆర్ఆర్ఆర్, త్రివిక్రమ్ సినిమాల తరువాత ప్రారంభించేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.