” బాలకృష్ణ తో నాకు విభేదాలు ఉన్నాయి “అని ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పలేదు, “ఎన్టీఆర్ తో నాకూ నా ఫ్యామిలీ కీ సంబంధాలు లేవు, అతను నందమూరి వారసుడు కాదు” అని బాలయ్య కొదొఆ ఎక్కడా మాట తూలలేదు కానీ నందమూరి అభిమానుల్లోస్పష్టమైన చీలిక కనిపిస్తోంది.ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్.
ఒకటేమిటి.అక్కడా ఇక్కడా అని కాదు, ఎడా పెడా కామెంట్లతో ‘దురభిమానులు’ దురద తీర్చేసుకుంటున్నారు.‘అసలు వీళ్ళు అభిమానులేనా.?’ అని అంతా ముక్కున వేలేసుకునేలా వుంది వారి తీరు.స్వర్గీయ ఎన్టీఆర్ నుంచీ నిన్నా మొన్నా వచ్చిన తారకరత్న దాకా అందరినీ నెత్తిన పెట్టుకున్న నందమూరి అభిమానులలో సోషల్ మీడియా సాక్షిగా పెద్ద యుద్ధమే జరుగుతోంది.సోషల్ మీడియా నే కదా అని తేలికగా తీసేయడానికి లేదు వారిలో వైరం పెరిగి అది విడుదల రోజు రోడ్ల మీదకి కూడా వచ్చేలాగా కనిపిస్తోంది.
నందమూరి వంశానికి వారసుడొక్కడేననీ.ఆ వారసుడు బాలయ్యేననీ వాటిపై రాతలు రాస్తున్నారు.స్వర్గీయ ఎన్టీఆర్కి బాలకృష్ణ వారసుడైతే, బాలయ్యకు మోక్షజ్ఞ వారసుడవుతాడనేది ఆ వ్యాఖ్యల సారాంశం.ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎందఱో నటులు వచ్చినా అభిమానుల ప్రేమని చొరగొంది మాత్రం మొట్ట మొదట బాలకృష్ణ మాత్రమె.
ఆ తరవాతే ఎవరైనా .ఎన్టీఆర్ లెగసీ ని స్థాపించి దాన్ని కంటిన్యూ చేసారు బాలయ్య.బాలకృష్ణను మించి బాక్సాఫీస్ దగ్గర స్టామినా చూపించి, ఓ దశలో నెంబర్ వన్ హీరో అనే సింహాసనం వైపు వడివడిగా అడుగులేశాడు ఎన్టీఆర్.కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది.
అభిమానుల్లో ఈ చీలిక.నందమూరి హీరోలకు ఇబ్బందికరంగా మారింది.బాలకృష్ణ కానీ ఎన్టీఆర్ కానీ ఒకే ఒక్క వ్యాఖ్య లేదా ఒక చర్య ద్వారా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు కానీ వారు అది చెయ్యట్లేదు.” మేం కలిసే ఉన్నాం” అని ఒక్క మాట చెబితే చాలు అది చెయ్యకపోగా వివాదాలకి దారి తీసే విధంగా సినిమాల విడుదల ప్లాన్ చేస్తున్నారు ఇద్దరూ.సంక్రాంతికి నాలుగైదు సినిమాలు రావడం మామూలే.ఈసారి బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలు ఒకేసారి అభిమానుల్ని అలరించనున్నాయి.అది అభిమానులకు డబుల్ పండగ.దాన్ని దురభిమానులు వివాదం చేయడమెంతవరకు సబబు?
.