యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా తారక్ అప్పుడే లైన్లో పెట్టాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు తారక్.
అయితే తారక్ ఆర్ఆర్ఆర్ తరువాత మరో పాన్ ఇండియా మూవీ చేసే అవకాశం ఉండగా త్రివిక్రమ్తో సినిమా చేస్తుండటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.తారక్తో పాన్ ఇండియా తరహా మూవీ చేసేందుకు పలు భాషల దర్శకుడు రెడీగా ఉన్నారు.
అయినా వారందరినీ కాదని తారక్ త్రివిక్రమ్కే ఓటేయడంతో అతడికి పాన్ ఇండియా మూవీలపై పెద్దగా ఆశ లేదని తెలుస్తోంది.
పాన్ ఇండియా మూవీ అంటూ నిర్మాతల జేబులకు చిల్లులు వేయడం తనకు అవసరం లేదని తారక్ సన్నిహితులు అంటున్నారు.
ఉన్నంతలో మంచి సినిమా తీయాలనే ఆశతోనే తారక్ నిర్మాతలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని వారు అంటున్నారు.ఏదేమైనా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీల జోరు సాగుతుండటంతో తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.