యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో లాగా కాకుండా ఏడాదికో సినిమా చొప్పున తీస్తూ తన ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.అయితే వరుసగా సూపర్ హిట్ సినిమాలు తీస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న తారక్ ప్రస్తుతం ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని కూడా తెలుగు స్టార్ డైరెక్టర్తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
మిగతా హీరోలు పాన్ ఇండియా సినిమాలు, ఇతర భాష దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా, తారక్ మాత్రం వాటికి దూరంగా ఉన్నాడు.
పాన్ ఇండియా సినిమాలు పర్ఫెక్ట్ సబ్జెక్టుతోనే తెరకెక్కాలని తారక్ అనుకున్నాడట.సబ్జె్క్టుతో పాటు సత్తా ఉన్న డైరెక్టర్తో మాత్రమే అలాంటి సినిమాలు చేస్తానని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు.
అందుకే పాన్ ఇండియా సినిమాల జోలికి యంగ్ టైగర్ వెళ్లడం లేదు.ఇక ఇతర భాష డైరెక్టర్లతో సినిమాలు చేస్తే నేటివిటీ తొందరగా ప్రేక్షకులకు ఎక్కదని ఆలోచించిన తారక్ ఇప్పట్లో అలాంటి నిర్ణయం తీసుకోడని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో తారక్ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే త్రివిక్రమ్ ఓ సబ్జెక్ట్ వినిపించగా, తారక్ ఆ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా తారక్ నిర్ణయం పట్ల పలువురు నిర్మాతలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.