నిన్న తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఓ రేంజ్ లో జరిగాయి.ఎన్నికలకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొందరు నటులు షూటింగ్ బిజీలో హైదరాబాదులో లేనందున ఎన్నికలకు రాలేకపోయారు.కానీ ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్ లో ఉన్న కూడా ఎన్నికలకు రాలేకపోయాడు.
దీంతో ఎందుకు ఎన్టీఆర్ రాలేదు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
నిన్న జరిగిన మూవీ అసోసియేషన్ ఎన్నికలు ఎన్నడూ జరగని విధంగా జరిగింది.
రెండు ప్యానల్స్ సభ్యుల మధ్య మాటల యుద్ధం బాగా జరిగింది.ఈసారి సెలబ్రేటీలంతా ఎక్కువ సంఖ్యలో పాల్గొని తాము ఎన్నుకున్న అభ్యర్థికి ఓటు వేశారు.
ఇందులో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీగా నిలిచిన సంగతి తెలిసిందే.గత కొన్ని రోజుల నుండి వీరి మధ్య గట్టిపోటీ జరగగా మొత్తానికి మంచు విష్ణు చేతిలో ఓడిపోయాడు ప్రకాష్ రాజ్.
ఇక ఎన్టీఆర్ ఈ ఎన్నికలకు రాకపోయేసరికి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి.ప్రస్తుత పరిణామాలు తనకు నచ్చలేదని అందుకే ఓటు వేయనని ఎన్టీఆర్ అన్నాడని జీవిత రాజశేఖర్ తెలిపింది.
దీంతో ఈ విషయం తెలిసే సరికి బాగా చర్చలు జరిగాయి.అయినా కూడా ఎన్టీఆర్ ఓటు వేయడానికి రాలేదు.దీంతో మంచు విష్ణు రియాక్ట్ అవ్వగా తన తమ్ముడు ఎన్టీఆర్ తో మాట్లాడాడని పోలింగ్ కు వచ్చి ఓటు వేస్తానని మాట ఇచ్చాడని తెలిపాడు.
ఇక ప్రకాష్ రాజ్ కూడా ఎన్టీఆర్ గురించి స్పందించడంతో.బంగారం తో తాను మాట్లాడానని ఓటు వేయడానికి చెప్పడంతో తప్పు అని సరిదిద్ది చెప్పానని అన్నాడు.మొత్తానికి ఎన్టీఆర్ పై ఇంత రచ్చ జరుగుతున్నా కూడా ఆయన తన ఇష్టపూర్వకంగానే ఎలక్షన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని తెలిసింది.
అంతేకాకుండా మరో విషయం ఏంటంటే అసోసియేషన్ లో స్టార్ హీరోలు ఓటు వేసిన విషయం బయటకి తెలిసిపోతుంది.
దీంతో ఎన్టీఆర్ ఓటు వేసి వచ్చే వివాదాల పరిణామాలకు దూరంగా ఉండాలని అనుకోని అలా డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది.ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది నటీనటులు కూడా ఓటింగుకు రాలేదు.అయినా కూడా ఎన్టీఆర్ గురించే చర్చలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్.మెగా, మోహన్ బాబు కాంపౌండ్ దూరం ఉండాలని కాబట్టి వచ్చి ఓటు వేసి వాదనలు ఎదుర్కోవడం కంటే సైలెంట్ గా ఉండాలని అనుకున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు పవన్ కళ్యాణ్, మోహన్ బాబు మధ్య కూడా ఏదైనా కౌంటర్ ల యుద్ధం జరుగుతుందేమో అని టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా చర్చలు నడుస్తున్నాయి.ఎన్నికల ముందే కాకుండా ఎన్నికలు ముగిశాక కూడా ఇండస్ట్రీలో జరగాల్సిన చర్చ జరుగుతూనే ఉంది.ఇక ఎన్ని రోజుల వరకు ఇటువంటి చర్చ ఉంటుందో తెలియదు కానీ మొత్తానికి ఈ ఎన్నికలు మాత్రం బాగా హాట్ టాపిక్ గా మారింది.