నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.డిసెంబర్ 2న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను విడుదల చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది.
బోయపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడం వల్ల సింహా మరియు లెజెండ్ సినిమా ల ఫలితాలు గుర్తుకు వస్తున్నాయి.అందుకే ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుని బాలయ్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు .ఇంతటి ప్రతిష్టాత్మక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మరియు నాని లు పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఈ వారంలోనే ప్రీ రిలీజ్ వేడుక ను ప్లాన్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా వచ్చిన వార్తల నేపథ్యంలో అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తి వ్యక్తం చేశారు.అయితే తాజాగా ఎన్టీఆర్ ప్రాన్స్ వెళ్లాడు.కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ సరదాగా కాలం గడిపేస్తున్నాడు.
ఇటీవల అక్కడ నుండి కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఎన్టీఆర్ కనీసం వారం పది రోజులు అయినా విదేశీ పర్యటనలోనే ఉంటాడు.
కనుక మీడియాలో వస్తున్నట్లుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు.ఎన్టీఆర్ మాత్రమే కాకుండా నాని కూడా అన్నారు.
మరి నాని విషయంలో ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.నాని ఇటీవల అన్ స్టాపబుల్ లో కనిపించాడు.
కనుక బాలయ్య కోసం ఆయన వచ్చే అవకాశాలు లేకపోలేదు.మొత్తానికి బాలయ్య అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుక స్పెషల్ గెస్ట్ పెద్ద సస్పెన్స్ గా మారింది.