ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పెట్టి క్రేజీ సినిమాల్లోనే నటిస్తున్నాడు.రాజమౌళితో చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమాలో నటిస్తున్నాడు.
హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్పై చినబాబు, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై తారక్ సోదరుడు కళ్యాణ్రామ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్టీఆర్ కోసం అదిరిపోయే పొలిటికల్ థ్రిల్లింగ్ + ఫ్యామిలీ అంశాల మేళవింపుతో అదిరిపోయే స్టోరీ కూడా రెడీ చేశాడని తెలుస్తోంది.
ఈ రెండు సినిమాల తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే సినిమాకు ఓకే చెప్పాడు.మైత్రీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇప్పటికే మైత్రీ వాళ్లు అటు ప్రశాంత్నీల్కు, ఇటు ఎన్టీఆర్కు అడ్వాన్స్లు కూడా ఇచ్చేశారని టాక్.కేజీఎఫ్ 2 కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ వర్క్ స్టార్ట్ చేస్తాడు.
ఇదిలా ఉంటే వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇస్తోన్న ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడట.
ఈ సారి తన సోదరుడు కళ్యాణ్రామ్ బ్యానర్లోనే ఈ సినిమా ఉంటుందంటున్నారు.
పటాస్తో కళ్యాణ్రామ్ అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తే ఈ రోజు అనిల్ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నాడు.అప్పటి నుంచి కళ్యాణ్రామ్ కోసం మరో సినిమా చేయాలని అనిల్ వెయిట్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు అనిల్ ఏకంగా అదే కళ్యాణ్ బ్యానర్లో ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.ఎన్టీఆర్ సినిమాలు కంప్లీట్ అయ్యేలోగా అనిల్ ఎన్టీఆర్ సినిమాకు కథ రెడీ చేసుకోవచ్చని తెలుస్తోంది.