మైత్రి మూవీస్ బ్యానర్ లో జనతా గ్యారేజ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా లో ఎన్టీఆర్ తో పాటు పెద్ద రోల్ లో మోహన్ లాల్ చేస్తూ ఉండగా ఈ సినిమా పారితోషికం విషయం లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడి అవుతున్నాయి.
జనతా గ్యారేజ్ సినిమా కి సంబంధించి ఆయన పారితోషికం కోసం అని మోహన్ లాల్ కి కోటిన్నర ఇచ్చారు అనీ దాంతో పాటు మలయాళం హక్కులు కూడా ఆయనకే ఇచ్చారు అని తెలుస్తోంది
ఈ సినిమాలో ఒక ముప్పై నిమిషాల పైగా నిడివి ఉండే మోహన్ లాల్ పాత్ర కోసం మలయాళం లో సినిమా ఎంతో పలకదు లే అనుకుని ఇలా చేసారు మైత్రీ మూవీస్ వారు కానీ ట్విస్ట్ ఇక్కడే ఒచ్చింది.మలయాళం లో నాలుగు కోట్లు పలికేసింది ఈ సినిమా.
అసలు ఊహించని ఈ ట్విస్ట్ కి షాక్ తిన్నారు నిర్మాతలు.ఎన్టీఆర్ కి మలయాళం లో పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి అక్కడ ఏమీ పలకదులే అనుకున్నారు కానీ ఊహించనట్టుగా ఈ రేంజ్ లో సినిమా అమ్ముడు అయ్యింది.
సో మొత్తం ఐదున్నర కోట్లు మోహన్ లాల్ కి వెళ్ళిపోయాయ్ .