తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో ఢిల్లీలో పెద్దలని కదిలించిన మహా నాయకుడు, తెలుగు సినీ వినీలాకాశంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు ఎన్టీఆర్.ఆయన జీవిత కథని బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరపై ఆవిష్కరించాడు.
అయితే ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టాలని వదిలేసి అతనో మహాత్ముడు అనే విధంగా, అలాగే తెలుగు దేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి హెల్ప్ అయ్యే విధంగా ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ, క్రిష్ కలిసి తెరకెక్కించారు.దీంతో రిలీజ్ కి ముందు ఈ సినిమా హైప్ వున్నా కూడా మొదటి భాగం కథానాయకుడు దారుణంగా ఫ్లాప్ అయ్యింది.
కథానాయకుడు సినిమా కొంతలో కొంత అయిన పెట్టిన పెట్టిబడిలో సగం వరకు రాబట్టగలిగింది.అయితే దానికి కొనసాగింపుగా ఎన్టీఆర్ రాజకీయ జీవితంతో వచ్చిన మహా నాయకుడు సినిమా మాత్రం దారుణం ఫలితాన్ని మిగిల్చింది.
ఓ విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా వచ్చిన రెండు సినిమాలు అతనికి మరో సారి ఘోర అవమానం మిగిల్చాయి.మహానాయకుడు సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ తాజాగా బయటకి వచ్చాయి.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కేవలం 4.34 కోట్లకి పరిమితం అయ్యింది.దీంతో ఈ సినిమా మరో సారి బయ్యర్లని నిలువునా ముంచింది అని చెప్పాలి.