ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువ సినిమాలు పాన్ ఇండియా సినిమాలనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ అనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించిన వార్తలు విని అభిమానులు సైతం షాకవుతున్నారు.ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
పెరిగిన మార్కెట్ ను నిలబెట్టుకోవాలంటే భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కిస్తే మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
ఆ రీజన్ వల్లే ఎన్టీఆర్, కొరటాల శివ 200 కోట్ల రూపాయలతో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని ఈ సినిమాలో పాన్ ఇండియా నటులను తీసుకోనున్నారని తెలుస్తోంది.చరణ్ శంకర్ సినిమా కూడా దాదాపు ఇదే బడ్జెట్ తో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు తారక్ కు జోడీగా అరవింద సమేత వీరరాఘవ సినిమాలో నటించిన పూజా హెగ్డే నటించనుందని తెలుస్తోంది.ఈ సినిమాలో పారితోషికాలకు ఏకంగా 100 కోట్ల రూపాయలు అవుతాయని తెలుస్తోంది.
కొరటాల తన సినిమాలలో కమర్షియల్ అంశాలకు పెద్దపీట వేస్తున్నారని తెలుస్తోంది.కొరటాల శివ తన స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్ ను ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం చేయనున్నారు.
కనీసం 300 కోట్ల రూపాయల బిజినెస్ చేసే అవకాశం ఉండటంతో అంత భారీ బడ్జెట్ కు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఫ్యాన్స్ పూజా హెగ్డే వద్దని చెబుతుండటంతో కియారా అద్వానీ లేదా అలియా భట్ ను ఈ సినిమాలో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.ఈ సినిమాకు జనతా గ్యారేజ్ సినిమాకు పని చేసిన తిరు పని చేయనున్నారని తెలుస్తోంది.దసరా తర్వాత ఈ మూవీ షూటింగ్ మొదలుకానుందని సమాచారం.