యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెరమీద కనిపించి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు తెర మీద కనిపించ లేదు.
ఆ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కమిట్ అయ్యాడు.ఇక అప్పటి నుండి ఈ సినిమా షూటింగ్ లోనే తారక్ బిజీగా ఉంటున్నాడు.
మధ్యలో కరోనా రావడంతో ఈ సినిమా ఆలస్యం అయ్యింది.దీంతో ఎన్టీఆర్ తెరమీద కనిపించి రెండు సంవత్సరాలు అవుతుంది.ఇక ఈ సినిమా షూటింగ్ ను ఈ మధ్యనే పూర్తి చేసి విడుదలకు రెడీ చేసారు.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
ఇక ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
ఈ మధ్యలో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో లో హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ షో కూడా ఎండింగ్ కి వాచినట్టు సమాచారం.దీంతో ఎన్టీఆర్ కి కాస్త విరామం దొరికింది.అయితే కొరటాలతో సినిమా స్టార్ట్ కావడానికి చాలా సమయం ఉన్నందు వల్ల ఎన్టీఆర్ ఈ గ్యాప్ లో తన భార్య, పిల్లలతో కలిసి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడట.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగాయి.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా ఆలియా భట్ ను నటింపజేసేందుకు ట్రై చేస్తున్నారట.
ఇక ఈ సినిమా 40 రోజుల లాంగ్ షెడ్యూల్ ను ఈజిప్టు లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఈ సినిమాను ఎన్టీఆర్ వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని భావిస్తున్నాడట.
ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.