నందమూరి కుటుంబ సభ్యులు ప్రతియేటా నందమూరి తారక రామారావు జయంతిని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్కు నివాళులు అర్పించి జరుపుతారు.ఈ క్రమంలో అక్కడ నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఎన్టీఆర్ను గుర్తుకుచేసుకుంటారు.
కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఏడాది ఎన్టీఆర్ జయంతి వేడుకలపై నందమూరి హీరోలైన జూ.ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఓ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో తమ అభిమానులు సురక్షితంగా ఉండేందుకు నందమూరి హీరోలు ఈయేడు ఎన్టీఆర్ జయంతిని తమ ఇంట్లోనే జరుపుకుని, ఎన్టీఆర్కు నివాళులు అర్పించేందుకు సిద్ధమవుతున్నారు.ఎన్టీఆర్ ఘాట్ వద్ద జయంతి వేడుకలు నిర్వహిస్తే అభిమనులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, అది అంత సురక్షితం కాదని తారక్, కళ్యాణ్రామ్లు భావించారు.
దీంతో నందమూరి అభిమానులు కాస్త నిరాశకు లోనైనా కూడా అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని వారు అంటున్నారు.
మొత్తానికి కరోనా వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోవడంతో, ఈసారికి ఇలా ఇంట్లోనే తమ తాత నందమూరి తారక రామారావు జయంతిని కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే నిర్వహించేందుకు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ రెడీ అవుతున్నారు.
కరోనా వైరస్ ప్రభావం త్వరగా దూరమై మునుపటి రోజులు రావాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు.