ఎన్టీఆర్ జయంతి వేడుకలకు నందమూరి హీరోలు దూరం

నందమూరి కుటుంబ సభ్యులు ప్రతియేటా నందమూరి తారక రామారావు జయంతిని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి జరుపుతారు.ఈ క్రమంలో అక్కడ నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఎన్టీఆర్‌ను గుర్తుకుచేసుకుంటారు.

 Ntr Kalyan Ram Decision On Ntr Jayanthi, Ntr, Kalyan Ram, Nandamuri Family, Ntr-TeluguStop.com

కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఏడాది ఎన్టీఆర్ జయంతి వేడుకలపై నందమూరి హీరోలైన జూ.ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఓ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో తమ అభిమానులు సురక్షితంగా ఉండేందుకు నందమూరి హీరోలు ఈయేడు ఎన్టీఆర్ జయంతిని తమ ఇంట్లోనే జరుపుకుని, ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు సిద్ధమవుతున్నారు.ఎన్టీఆర్ ఘాట్ వద్ద జయంతి వేడుకలు నిర్వహిస్తే అభిమనులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, అది అంత సురక్షితం కాదని తారక్, కళ్యాణ్‌రామ్‌లు భావించారు.

దీంతో నందమూరి అభిమానులు కాస్త నిరాశకు లోనైనా కూడా అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని వారు అంటున్నారు.

మొత్తానికి కరోనా వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోవడంతో, ఈసారికి ఇలా ఇంట్లోనే తమ తాత నందమూరి తారక రామారావు జయంతిని కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే నిర్వహించేందుకు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ రెడీ అవుతున్నారు.

కరోనా వైరస్ ప్రభావం త్వరగా దూరమై మునుపటి రోజులు రావాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube