టాలీవుడ్ హీరో ల్లో అత్యధికంగా యాడ్స్ లో నటించిన హీరో మహేష్ బాబు.దాదాపు దశాబ్ద కాలంగా మహేష్ బాబు వరుసగా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఒకానొక సమయం లో బాలీవుడ్ స్టార్ హీరోల కంటే కూడా అధికంగా మహేష్ బాబు సినిమాల్లో నటిస్తూ కమర్షియల్ యాడ్స్( Commercial Ads )లో నటించడం జరిగింది.ఇప్పటికి కూడా మహేష్ బాబు చేస్తున్నన్ని కమర్షియల్ యాడ్స్ మరే స్టార్ చేయడం లేదు అనడంలో సందేహం లేదు.
కమర్షియల్ యాడ్స్ విషయం లో బాలీవుడ్ హీరోలతో పోటీ పడుతున్న మహేష్ బాబు పారితోషికం( Mahesh Babu Remuneration ) విషయం లో ఎన్టీఆర్ తో పోలిస్తే వెనక పడ్డాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న రెండు కమర్షియల్ యాడ్స్ రెమ్యూనరేషన్ మహేష్ బాబు గతంలో ఎప్పుడూ తీసుకోలేదు.
ఆర్ఆర్ఆర్ చిత్రం తో మహేష్ బాబు కంటే కూడా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెరిగింది.
ప్రస్తుతం ఎన్టీఆర్( NTR ) పాన్ ఇండియా స్టార్ హీరో అవ్వడం వల్ల ఆయన తో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించుకోవాలని ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి.అందుకే భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు.అతి తక్కువ కంపెనీలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్న ఎన్టీఆర్ ఇటీవల ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఓకే చెప్పాడు.
దాంతో ఆయన రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేశాడని సమాచారం అందుతుంది.తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూనరేషన్( NTR Remuneration ) తీసుకుంటున్న కమర్షియల్ హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ విషయమై తెగ చర్చ జరుగుతుంది.ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తోంది.వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
ఆ తర్వాత హిందీ సినిమాల్లో కూడా ఎన్టీఆర్ నటించబోతున్నాడు.ఈ సంవత్సరం లోనే హిందీ సినిమాల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.