యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరి కంటే డిఫరెంట్ అనేది అందరికి తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే మరోసారి అతను డిఫరెంట్ అని నిరూపించుకున్నారు ఎన్టీఆర్.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలంతా కూడా పాన్ ఇండియా బాట పడుతున్నారు.
మాతృ భాషతో పాటు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోవాలి అని మన హీరోస్ తొందరపడుతున్నారు.
ఇంకా ఇప్పటికే ప్రభాస్ కి, రానా కి బాహుబలి సినిమాతో ఇండియా కాదు.
వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ సొంతం అయ్యారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే ఇదే బాటలో ఎన్టీఆర్ నడుస్తాడు అని అందరూ అనుకున్నారు.కానీ ఎన్టీఆర్ లెక్కలు వేరున్నాయి.
పాన్ ఇండియా సినిమా కంటే కూడా కథే ముఖ్యం అని అంటున్నాడు ఎన్టీఆర్.ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో మల్టి స్టారర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు యంగ్ టైగర్.అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలానో పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది కాబట్టి తరువాత తాను నటించే సినిమాలు పాన్ ఇండియాగా విడుదల అవుతాయి అని అనుకున్నారు.
కానీ ఎన్టీఆర్ కి ఆ ఆలోచనలు లేదు.కేవలం తెలుగులోనే సినిమా విడుదల చెయ్యాలి అని అయన అనుకుంటున్నట్టు సమాచారం.
అంతేకాదు.పాన్ ఇండియా కంటే కూడా కథే ముఖ్యం అని ఎన్టీఆర్ అంటున్నారట.
మరి కథ ఉంటే పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తారు అని అర్థం అవుతుంది
.