ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాతో ఎన్టీయార్( Ntr ), రాంచరణ్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వీళ్లిద్దరికీ బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తుంది.బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు సైతం మాతో ఒక్క సినిమా చేయండి అంటూ వీళ్ళని వేడుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఆ క్రమం లోనే వీళ్లు కూడా వాళ్ళకి డేట్స్ కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు అని తెలుస్తుంది…ఆర్ ఆర్ ఆర్ ఒక్క సినిమా తో రాజమౌళి ఎంత పెద్ద మ్యాజిక్ చేసాడో మనందరికీ తెలిసిందే అయితే ఒకప్పుడు మన తెలుగు సినిమాలని,మన హీరోలని అసలు పట్టించుకోని అక్కడి ప్రొడ్యూసర్లు ఇప్పుడు మన హీరోల డేట్స్ కోసం వెయిట్ చేయడం చూస్తున్న సినీ అభిమానులందరూ కూడా చాలా సంతోషం లో ఉన్నట్టు తెలుస్తుంది…
ఇక ఇది అలా ఉంటె వాళ్ళ టార్చర్ భరించలేని ఎన్టీయార్ బాలీవుడ్ కి సంభందించిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో సినిమా కమిట్ అయ్యాడు అంటూ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సినిమా తర్వాత ఎన్టీఆర్.
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం అందుతుంది.ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ లతో సినిమాలు నిర్మిస్తున్న టిసిరీస్ భూషణ్ తో ఎన్టీయార్ సినిమా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
రీసెంట్ గా లాంచ్ అయిన ఎన్టీఆర్ 30 వేడుకల్లో కూడా ముంబయ్ నుంచి భూషన్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.దాంతో ఈసినిమా రూమర్స్ నిజమే అని తెలుస్తోంది.
భూషన్ ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు పూర్తి చేసేలోపు.తారక్ ఎన్టీఆర్ 30 తో పాటు ప్రశాంత్ నీల్ తో సినిమాలు కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారని టాక్ .ఆ తరువాత వీరి కాంబోలో భారీ బడ్జెట్ తో సినిమా వస్తుంది అంటున్నారు త్వరలోనే ఎన్టీఆర్ తో టీ సిరీస్ సినిమా అనౌన్స్ చేయనున్నరని సమాచారం.భూషణ్ కుమార్( Bhushan Kumar ) ఈవెంట్ లకి త్వరగా రాడు.
అలాంటిది ఎన్టీఆర్ మూవీ లాంచ్ కే వచ్చాడంటే.ఎన్టీఆర్ తో సినిమా నిర్మించడానికి వచ్చి ఉండాలి అనే అంటున్నారు .అలాగే పలువురు బాలీవుడ్ మేకర్స్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది .
ఇక ఇప్పటికే తెలుగు సినిమా స్థాయి ఆకాశం అంచుల్లో ఉంది.
ఇండియన్ సినిమా
అంటే ఇక మీదట తెలుగు సీనిమానే అనేంతల మన సినిమాలు అన్ని భాషల్లో సూపర్ హిట్ అవ్వడం చూస్తుంటే ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమా హీరోలు డైరెక్టర్ల మీదనే ఆధారపడే పరిస్థితి వస్తుంది అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అనే చెప్పాలి…
.