మహేష్ బాబు పోకిరి రీ రిలీజ్ తర్వాత వరుసగా సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ జల్సా సినిమా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమా ఇలా ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ జల్సా సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో ఆ రికార్డును తాజాగా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ అయ్యి బ్రేక్ చేసింది.ఇప్పుడు చెన్నకేశవరెడ్డి రికార్డు ని నందమూరి ఫ్యామిలీకే చెందిన ఎన్టీఆర్ తన ఆది సినిమాతో బ్రేక్ చేసేందుకు సిద్ధం అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
ఆది సినిమా విడుదలై 21 ఏళ్లు పూర్తయింది.గత ఏడాది 20 ఏళ్ల సంబరం భారీగా జరిగింది.
గత ఏడాదిలోనే ఫ్యాన్స్ కోసం సినిమాను ప్రదర్శించారు.కానీ ఎక్కువ స్థాయిలో ప్రచారం చేయలేదు.
అయితే ఈసారి మాత్రం ఆది సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ బలంగా భావిస్తున్నాడట.అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నట్లుగా ఇప్పటికే బెల్లంకొండ సురేష్ అధికారికంగా ప్రకటించాడు.
నవంబర్ నెలలో సినిమాను రిలీజ్ చేయడం ద్వారా ప్రేక్షకుల ముందుకు మళ్ళీ ఆది సినిమాను తీసుకొస్తానంటూ ప్రకటించాడు.అప్పట్లో ఆది సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ఎన్టీఆర్ సరిగ్గా మీసాలు కూడా రాకుండానే ఇండస్ట్రీ హిట్ దక్కించుకోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.
ఆది సినిమాలోని యాక్షన్స్ సన్నివేశాలు ముఖ్యంగా ఫ్యాక్షన్స్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి అనే విషయం తెలిసిందే.అందుకే ఆ సినిమాను సీడెడ్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.
అభిమానించారు.ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది.
అందుకే ఎన్టీఆర్ కి ఆ సినిమా అంటే చాలా ప్రత్యేకం, ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా ఎన్టీఆర్ యొక్క అభిమానులు కలెక్షన్స్ వర్షం కురిపించడం ఖాయం.దాంతో బాబాయి బాలకృష్ణ రికార్డు బ్రేక్ అవ్వడం కూడా ఖాయమంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.