జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ కంప్లీట్ చేసే దశలో ఉన్నాడు.దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.
ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.భారీ బడ్జెట్ తోనే ఈ మూవీని తెరకెక్కించనున్నారు.
దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఒక సినిమా కమిట్ అయ్యాడు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని తెరకెక్కిస్తుంది.
ఇదిలా కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనే విషయం అందరికి తెలిసిందే.ఈ మూడు సినిమాలతో ఇండియన్ వైడ్ గా ఎన్టీఆర్ బ్రాండ్ ఇమేజ్ కచ్చితంగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది.
ఈ నేపధ్యంలో సంజయ్ లీలా బన్సాలీ కూడా ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని సౌత్ బ్యాక్ డ్రాప్ స్టొరీతో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.దీనిని స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
ఇలా మూడు భారీ ప్రాజెక్ట్స్ మధ్య ఇప్పుడు తారక్ మరో దర్శకుడుకి అవకాశం ఇచ్చాడని టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.ఉప్పెన మూవీతో దర్శకుడుగా ప్రయాణం మొదలుపెట్టిన బుచ్చిబాబు సాన రీసెంట్ గా చెప్పిన కథకి ఎన్టీఅర్ ఒకే చెప్పాడని, ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని సూచించినట్లు తెలుస్తుంది.ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.ఒక వేళ బుచ్చిబాబు స్క్రిప్ట్ సిద్ధం చేసి దాంతో ఎన్టీఆర్ ని మెప్పిస్తే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో కాకపోయినా సౌత్ ఇండియన్ రేంజ్ ప్రాజెక్ట్ గా దీనిని స్టార్ట్ చేయడానికి తారక్ టైమ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.