2010వ సంవత్సరం, కొద్ది నెలల గ్యాప్ లోనే పవన్ నటించిన పులి, మహేష్ నటించిన ఖలేజా చిత్రాలు విడుదలయ్యాయి.రెండూ సింగనమల రమేష్ నిర్మించగా, రెండు చిత్రాలు భారి డిజాస్టర్లుగా నిలిచాయి.
అదే సంవత్సరం వచ్చిన ఎన్టీఆర్ బృందావనం మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.మంచి లాభాలతో, బయ్యర్లను సంతృప్తిపరిచింది.
2016వ సంవత్సరం, మళ్ళీ కొద్దిపాటి గ్యాప్ లోనే పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ నటించిన బ్రహ్మోత్సవం విడుదలయ్యాయి.ఈసారి పాత కథే.రెండూ భారి డిజాస్టర్లే.చరిత్ర మరచిపోలేని డిజాస్టర్లు.
ఇక ఇదే సంవత్సరం ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ విడుదల కానుంది.కొరటాల శివ దర్శకుడు కావడంతో, ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అనే నమ్మకంలో ఉన్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.
పైగా సెంటిమెంటు ప్రకారం, మహేష్-పవన్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి, ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని డంఖా బజాయిస్తున్నారు తారక్ అభిమానులు.చూద్దాం, ఈ సెంటిమెంటు ఎలా పనిచేస్తుందో ఈ ఏడాది.