యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు.తారక్ అభిమానులు తారక్ సినిమా విడుదలైతే చేసే హంగామా మామూలుగా ఉండదు.
చిన్న వయస్సులోనే తారక్ మాస్ హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో అంతకంతకూ రేంజ్ ను పెంచుకున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో తారక్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కిందనే సంగతి తెలిసిందే.
తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమనులు ధ్వజస్తంభం కంటే ఎత్తుగా ఉన్న క్రేజ్ హ్యాండిల్ కు వేలాడుతూ కనిపించారు.ఏకంగా ఆరుగురు అభిమానులు వేలాడుతూ కనిపించడం చర్చనీయాంశమైంది.
ఆరుగురు అభిమానులు విచిత్రమైన వేషాలు వేసుకుని ఈ విధంగా రిస్కీ షాట్స్ చేయడం గమనార్హం.చేతిలో ఎన్టీఆర్ పోస్టర్ ను పట్టుకుని ఫ్యాన్స్ చేసిన ఈ ఫీట్లపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా సందర్భాలలో అభిమానాన్ని మనసులో ఉంచుకుంటే చాలని ప్రమాదాలకు దూరంగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా కొందరు ఫ్యాన్స్ మాత్రం హద్దులు దాటి ప్రవర్తిస్తుండటం గమనార్హం.ఇతర హీరోల అభిమానులు కూడా ఈ విధమైన ఫీట్లు చేయడం ద్వార తమ ఫేవరెట్ హీరోల పరువు తీస్తుండటం గమనార్హం.
ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి వస్తే తారక్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.తారక్ ప్రస్తుతం భార్యాపిల్లలతో కలిసి ఇంగ్లాండ్ వెకేషన్ లో ఉన్నారు.తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సినిమాసినిమాకు తారక్ కు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.