జెమిని ఛానెల్‌ పై ప్రేక్షకులు అసంతృప్తి

ఉత్తరాదిన సూపర్ హిట్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతి షో ను తెలుగు లో స్టార్‌ మా వారు మీలో ఎవరు కోటీశ్వరులు గా తీసుకు వచ్చారు.మొదట నాగార్జున హోస్టింగ్‌ చేయగా చిరంజీవి కూడా హోస్ట్‌ గా వ్యవహరించాడు.

 Ntr Fans Angry On Gemini Tv About Evaru Meelo Kotishwarulu ,  Corona , Evaru Mee-TeluguStop.com

రేటింగ్‌ సరిగా రాకపోవడంతో లాభాలు లేని కారణంగా షో ను నిలిచి వేశారు.ఇప్పుడు అదే ఫార్మట్ లో అదే షో ను జెమిని వారు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.

ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా ఎవరు మీలో కోటీశ్వరులు గా అనౌన్స్ చేశారు.ప్రకటించి కూడా నెలలు గడుస్తోంది.

ముందుగా అనుకున్న ప్రకారం అయితే గత నెలలో లేదా ఈ నెలలో షో ను ప్రారంభించాల్సి ఉంది.కాని ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జులై లేదా ఆగస్టు వరకు షో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఈ షో ను ప్రారంభించేందుకు ముందుగా ఆడిషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది.ఆ ఆడిషన్స్ కు కరోనా అడ్డు పడింది.

కరోనా వల్ల ఆడిషన్స్ ఆగిపోయినా జెమిని టీవీలో మాత్రం ప్రోమో వేస్తూనే ఉన్నారు.

ప్రతి అర్థగంట కు ఒకసారి అన్నట్లుగా జెమిని టీవీలో జెమిని మూవీస్‌ జెమిని మ్యూజిక్ లో కూడా ప్రోమోను వేస్తున్నాడు.

షో ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాని జెమిని టీవీ వారు మాత్రం త్వరలో త్వరలో అంటూ గత కొన్ని నెలలుగా నాన్చుతూ వస్తున్నారు.

ఇప్పటికి అయినా ఈ షో ను ప్రారంభించండ్రోయ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.జెమిని టీవీ వారు ప్రారంభించిన ఈ షో కు సంబంధించిన ఆడిషన్స్ పూర్తి అవ్వడానికి మరో నెల నుండి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

కనుక జెమిని టీవీలో షో ఆరంభం అయ్యేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.అప్పటి వరకు ఎన్టీఆర్‌ అభిమానులు కాస్త ఓపిక చేసుకుని ఎదురు చూడాల్సిందే అంటూ జెమిని వారు అనధికారికంగా అభిమానులను సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube