తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడం వల్ల బిగ్ బాస్ ను ప్రారంభిస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
కాని తాజాగా బుల్లి తెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో ను జెమిని టీవీలో ఎన్టీఆర్ చేయబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో తేదీని మరియు టైమ్ ను ప్రకటించిన తర్వాత వెళ్లడించే అవకాశం ఉందని అంటున్నారు.ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ మరియు ఎవరు మీలో కోటీశ్వరులు షో రెండు కూడా భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.
రెండు ఓకే సారి టెలికాస్ట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా క్లాష్ ఉంటుంది.పైగా ఎన్టీఆర్ షో అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉంటాయి.
ఆ సమయంలో బిగ్ బాస్ వస్తే జనాలు పట్టించుకుంటారా లేదా అనేది అనుమానం.అందుకే ఎన్టీఆర్ షో ను ప్రకటించిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 కు సంబంధించిన తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కు ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఎంపిక అయ్యారనే వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా ఎన్టీఆర్ షో టెలికాస్ట్ షో కోసం కూడా జనాలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే బుల్లి తెరపై ఎన్టీఆర్ కు మంచి రికార్డు ఉంది.కనుక బిగ్ బాస్ ను ఆయనకు పోటీగా తీసుకు రావడం అంటే చాలా పెద్ద సాహసం అనడంలో సందేహం లేదు.
అందుకే బిగ్ బాస్ కంటే ముందు ఎన్టీఆర్ షో తేదీ వస్తుంది.ఆ షో ను అనుసారంగా బిగ్ బాస్ షో ను ప్రకటిస్తారని తెలుస్తోంది.పెద్ద ఎత్తున అంచనాలున్న బిగ్ బాస్ షో సీజన్ 5 కి కూడా నాగార్జున హోస్టింగ్ ను చేసే అవకాశం ఉందంటున్నారు.నాగార్జున వర్సెస్ ఎన్టీఆర్ అంటూ వచ్చిన సమయంలో ఖచ్చితంగా ఎన్టీఆర్ ది పై చేయి అయ్యే అవకాశం ఉంటుంది.
కనుక ఈ సమయంలో బిగ్ బాస్ ను ప్రకటించడం సబబు కాదనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారట.