హిందీ లో సూపర్ హిట్ అయ్యి సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షో ను తెలుగు లో స్టార్ మా వారు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ తీసుకు వచ్చారు.నాగార్జున మరియు చిరంజీవి లు ఆ షో ను స్టార్ మా లో చేశారు.
కాని ఆ షో పెద్దగా రేటింగ్ దక్కించుకోలేదు.దాంతో స్టార్ మా వారు వదిలేశారు.
ఆ తర్వాత మళ్లీ ఆ షో రాకపోవచ్చు అనుకున్నారు.కాని అనూహ్యంగా జెమిని టీవీ వారు ఈ షో ను ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
ఎన్టీఆర్ తో ఇప్పటి కే షో కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.కాని కరోనా వల్ల షో కు సంబంధించిన ఏర్పాట్లు ఆగిపోయాయి.
మొదట అనుకున్నట్లుగా ఈ షో ను మే నెల అంటే ఈనెలలో ప్రారంభం అవ్వాల్సి ఉంది.
ఈ నెలలో ఆరంభం అవ్వాల్సిన ఎవరు మీలో కోటీశ్వరులు మరో రెండు నెలలో కూడా ఆరంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
మొన్నటి వరకు తిరుపతి లో ఆడిషన్స్ ను నిర్వహించారు.ఆ తర్వాత వైజాగ్ మరియు విజయవాడలో కూడా ఆడిషన్స్ ను నిర్వహించాలని జెమిని టీవీ వారు అనుకున్నారు.
కాని కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆడిషన్స్ ను నిలిపి వేశారు.ఇప్పటికే ఎంపిక అయిన వారి పరిస్థితి ఏంటీ అనేది అర్థం కావడం లేదు.ఎంపిక అయిన వారి జాబితాను వారు ప్రకటించలేదు.కనుక ఆడిషన్స్ లో పాల్గొన్న వారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఆగస్టు వరకు ఈ షో ఆరంభం అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.మొత్తానికి కరోనా వల్ల రెండు మూడు నెలల పాటు ఎవరు మీలో కోటీశ్వరులు ఆలస్యం కాబోతుంది.