తెలుగు బుల్లి తెరపై నందమూరి తారక రామారావు అలియాస్ ఎన్టీఆర్ మరో సారి సందడి చేయబోతున్నాడు.గతంలో బిగ్ బాస్ తో బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో తో సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న ఈ బుల్లి తెర బిగ్గెస్ట్ షో మొదటి ప్రోమో ఇప్పటికే వచ్చింది.ఆ ప్రోమోలో ఎన్టీఆర్ ను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ సమయంలోనే రెండవ ప్రోమోను జెమిని టీవీ విడుదల చేసింది.మొదటి ప్రోమో సక్సెస్ అవ్వడంతో రెండవ ప్రోమోను కూడా విడుదల చేసి షో పై మరింత ఆసక్తి పెంచారు.
ఇక రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి.మీరు సిద్దంగా ఉన్నారా అంటూ ఈ ప్రోమో లో షో పై ఆసక్తిని పెంచారు.
ఎన్టీఆర్ తో ఈ ప్రోమోలను త్రివిక్రమ్ తెరకెక్కించిన విషయం తెల్సిందే.త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంను మే నెల నుండి ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను ముగించిన తర్వాత కాని ఈ షో ప్రారంభించే అవకాశం లేదు.
ఆ లోపు ఈ షో కోసం రిజిస్ట్రేషన్స్ మరియు ఆడిషన్స్ ఇతర చర్చలు జరుగబోతున్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ బుల్లి తెర షో పై నిర్వాహకులు కోట్లు పెడుతున్నారు.
మరి వారికి లాభాలను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.స్టార్ మాలో వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడుకు గతంలో చిరంజీవి మరియు నాగార్జునలు హోస్టింగ్ చేశారు.
ఇప్పుడు ఎన్టీఆర్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.