స్టార్ మా లో ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను ప్రస్తుతం జెమిని టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా టెలికాస్ట్ చేస్తున్నారు.గతంలో స్టార్ మా కోసం చిరంజీవి మరియు నాగార్జునలు హోస్టింగ్ లు చేశారు.
షో నిర్వాహకులకు నిరాశ పర్చింది.డబ్బులు ఖర్చు అవుతున్నా కూడా టెలికాస్ట్ అవుతున్న సమయంలో రేటింగ్ మాత్రం సరిగా రావడం లేదు.
అందుకే తప్పని పరిస్థితుల్లో షో ను వద్దనుకున్నారు.మళ్లీ ఇప్పుడు జెమిని వారు ఆ షోను టేకోవర్ చేశారు.
ఎన్టీఆర్ ను ఒప్పించి చాలా మంది వద్దకు షో ను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.షో కు పర్వాలేదు అన్నట్లుగా రేటింగ్ వస్తుంది.
వారంలో నాలుగు రోజులే అవ్వడం వల్ల మంచి రేటింగ్ వస్తున్నట్లుగా చెబుతున్నారు.అయితే గతంలో వచ్చిన షో కు ఈ షో కు ఒక తేడా ఉంది.
అదే ఈ షో కు మైనస్ అవుతుందని అంటున్నారు.
ఎన్టీఆర్ షో లో ఇప్పటి వరకు రామ్ చరణ్ మాత్రమే గెస్ట్ గా వచ్చాడు.
గత సీజన్ ల్లో చిరంజీవి మరియు నాగార్జునల ముందు చాలా మంది గెస్ట్లు కూర్చున్నారు.కాని ఈసీజన్ మాత్రం ఎవరు గెస్ట్ లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
గెస్ట్ లు రాకపోవడంకు కారణం సోమవారం నుండి గురువారం వరకు మాత్రమే ఈ షో సాగుతోంది.గతంలో శని ఆదివారాల్లో గెస్ట్ లను తీసుకు వచ్చేవారు.కాని ఈసారి అలా లేదు.అందుకే ఎన్టీఆర్ షో లో గెస్ట్ లు రావడం లేదు.
వారంలో ఒక్క రోజు అయినా షో కు సెలబ్రెటీలు వస్తే బాగుంటుందని అప్పుడు రేటింగ్ బారీగా పెరుగుతుందని కొందరు అంటున్నారు.కాని ఎన్టీఆర్ షో కు ఆ అవకాశం లేకుండా పోయింది.సోమవారం నుండి గురువారం వరకు కంటిన్యూస్ గా కంటెస్టెంట్స్ మాత్రమే వస్తున్నారు.అయితే మద్యలో ఒక వారం అయినా సెలబ్రెటీలతో వీక్ ను నిర్వహిస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.