ప‌వ‌న్‌కు పోటీగా ఎన్టీఆర్ రెడీ

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రికి ఎవ‌రు కాంపిటీష‌న్ అవుతారో చెప్ప‌లేం! అలాగే ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రికి శ‌త్రువులు అవుతారో.మిత్రులు అవుతారో కూడా చెప్ప‌లేం.ఇప్పుడు ఇదే ప‌రిస్థితి ఏపీలోనూ క‌నిపిస్తోందంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు.2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ రెండో ద‌ఫా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని భావిస్తున్న టీడీపీ సార‌ధి, సీఎం చంద్ర‌బాబు.దానికి అనుగుణంగా ఇప్ప‌టి నుంచి పావులు క‌దుపుతున్నారు.2019 నాటికి ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాలి? ఎవ‌రిని చేర‌దీయాల‌ని అనే లెక్క‌లు ప‌క్కాగా వేసేస్తున్నార‌ని స‌మాచారం.అదేస‌మయంలో ప్ర‌స్తుతం ఉన్న వారిలో ఎవ‌రిని ప‌క్క‌న పెట్టాల‌ని కూడా ప్లాన్ చేశార‌ట‌.

 Ntr Election Campaign For 2019 Elections-TeluguStop.com

ఈ కూడిక‌లు తీసివేతల క్ర‌మాన్ని ప‌రిశీలించుకుంటే.ప్ర‌స్తుతం త‌మ‌కు మిత్రప‌క్షంగా భావిస్తున్న జ‌న‌సేనాని వ‌చ్చే ఎన్నిక‌ల్లో సింగిల్‌గా దిగే ఛాన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.ప్ర‌త్యేక హోదాతో ప‌నిలేద‌ని టీడీపీ అంటుంటే.

హోదానే కావాల‌ని ప‌వ‌న్ ఇటీవ‌ల అనంత స‌భ‌లోనూ స్ప‌ష్టం చేశాడు.ఇక‌, టీడీపీ నేత‌లు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని బాహాటంగానే విమ‌ర్శించారు.

ఈ క్ర‌మంలో 2019లో ప‌వ‌న్‌తో జ‌త‌క‌ట్టే యోచ‌న నుంచి విర‌మించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట చంద్ర‌బాబు.పోనీ జ‌త‌క‌ట్టినా.

టికెట్ల పంప‌కం నుంచి అధికారాన్ని పంచే వ‌ర‌కు అనేక చిక్కులు ఎదుర‌వుతాయ‌ని కూడా ఆయ‌న యోచిస్తున్నార‌ట‌.

ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.

మోడీ చ‌రిష్మా మీదే ఈ పార్టీ ఇప్పుడు నెట్టుకొస్తోంది.అయితే, తాజా పెద్ద నోట్ల ర‌ద్దుతో చిల్ల‌ర దొర‌క్క మోడీపై సామాన్యులు ఫైరైపోతున్నారు.ఇదే కొన‌సాగితే.2019లో ఆయ‌న చ‌రిష్మా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది.ఈ క్రమంలోనే చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత ఫార్ములానే న‌మ్ముకోవాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.జ‌నాల్లో నంద‌మూరి వంశానికి ఉన్న ఇమేజ్‌ను మ‌రోసారి వాడుకుని తిరిగి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం.దీనికి గాను ఆయ‌న జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ని తిరిగి 2019లో వాడుకోవాల‌ని చూస్తున్నార‌ట‌.2009 ఎన్నిక‌ల్లో బాబు.జూనియ‌ర్‌ను పెద్ద ఎత్తున వాడుకున్నారు.

జూనియ‌ర్ కూడా తాత ఎన్‌టీఆర్ మాదిరిగా ఖాకీ దుస్తులు ధ‌రించి.నేల‌ ఈనిందా.నింగి వంగిందా.

డైలాగుల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని వేడెక్కించారు.ఆ త‌ర్వాత ప్ర‌చారం ముగించుకుని వ‌స్తూ యాక్సిడెంట్ అయిన సంద‌ర్భంలోనూ ఆస్ప‌త్రి నుంచే వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌చారం చేశారు.

అయినా కూడా ఎందుకో అప్ప‌టి వైఎస్ గాలికి చంద్ర‌బాబు సైకిల్ టార్గెట్ రీచ్ కాలేదు.ఆ త‌ర్వాత ఎన్‌టీఆర్‌ని చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టేశారు.

ఇక‌, ఇప్పుడు మ‌రోసారి జూనియ‌ర్ ప్ర‌చారంతో అధికారంలోకి రావాల‌ని ప్లాన్ చేశార‌ట‌.దీనికి ఎన్టీఆర్ కూడా రెడీ అన్నార‌ట‌.

ఎందుకంటే.టీడీపీని ఆయ‌న త‌న తాత‌గారు స్థాపించిన పార్టీ అనే సెంటెమెంట్ జూనియ‌ర్‌ని క‌ట్టి ప‌డేస్తోంద‌ట‌.

సో.రాబోయే ఎన్నిక‌ల్లో.స్టార్ క్యాంపెయిన్ ఎన్టీఆర్ అరంగేట్రం ఖాయ‌మ‌న్న‌మాట‌!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube