యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని ప్రారంభించాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తారక్ గతంలో అరవింద సమేత చిత్రంలో నటించగా అది బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.
దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు తారక్ రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ను కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే అందరినీ అవాక్కు చేస్తూ ఈ సినిమాలో తారక్ డ్యుయెల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అటు ఈ సినిమాలో హీరోయిన్లు కూడా ఇద్దరు నటించనున్నట్లు తెలుస్తోంది.
ఒక హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని, మరో హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాను 2021 ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.