ఈమద్య కాలంలో హీరోలు అంతా కూడా నిర్మాతలుగా మారుతున్నారు.తమ సినిమాల నిర్మాణంలో పారితోషికంను పెట్టి భాగస్వామిగా అవుతున్నారు.
పారితోషికంలో కొద్ది మొత్తం పోయినా కూడా సినిమా హిట్ అయితే లాభాలే లాభాలు.అందుకే ఎక్కువ శాతం మంది ఈ దారిని ఎంపిక చేసుకున్నారు.
ముఖ్యంగా మహేష్బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్లతో పాటు ఇంకా కొందరు హీరోలు కూడా ఈ దారిలో నడుస్తున్నారు.
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ దారిలోకే వచ్చాడు.తన అన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్తో కళ్యాణ్ రామ్ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.అందుకే అన్నయ్యతో బిజినెస్ మాట్లాడుకుని తన ప్రతి సినిమాకు కూడా మరో నిర్మాతగా వ్యవహరించాలని ఒప్పందం చేసుకున్నాడు.
అందుకు గాను ఎన్టీఆర్కు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా రావడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 చిత్రం తెరకెక్కబోతుంది.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం అవుతాయి.ఆ సినిమాకు రాధాకృష్ణతో పాటు కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.
రాధాకృష్ణ త్రివిక్రమ్ తరపు కాగా, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తరపు అనే విషయంతెల్సిందే.ఎన్టీఆర్ కొత్తగా ఈ పద్దతిలో సినిమాలు ఒప్పుకుంటున్న కారణంగా కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరికి కూడా లాభాలే లాభాలు.