ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత కె.
జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా కన్ ఫర్మ్ అయ్యింది.ప్రశాంత్ నీల్ సినిమా గురించి ప్రతి అప్డేట్ నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తుంది.లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ నుండి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.సినిమాలో హీరో పాత్ర లీక్ అయ్యింది.ప్రశాంత్ నీల్ ఎన్.టి.ఆర్ ను పొలిటికల్ లీడర్ పాత్రలో చూపించబోతున్నాడట.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ కూడా చేయాల్సి ఉంది.
ఈ సినిమాల తర్వాత తారక్ తో సినిమా ఉంటుంది.కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు డబుల్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.
పాన్ ఇండియా మూవీగా రాబోతున్న తారక్, ప్రశాంత్ నీల్ సినిమాపై ఇంకా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించాలని భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.