బాలకృష్ణ, క్రిష్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా భారీగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.
కర్ణాటకలో నందమూరి అభిమానులు భారీ ఎత్తున ఉన్నారు.తెలుగులో స్టార్ హీరోల సినిమాలు ఈమద్య కాలంలో బెంగళూరు మరియు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో ఏకంగా పది కోట్లకు కాస్త అటు ఇటుగా వసూళ్లు చేస్తున్నాయి.అందుకే ఈ చిత్రంను కర్ణాటకలో భారీగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో విడి విడిగా ట్రైలర్ రిలీజ్ వేడుక, ఆడియో వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
ఇక జనవరి మొదటి వారంలో భారీ ఎత్తున బెంగళూరులో ఫ్యాన్స్తో ఒక ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని భావిస్తున్నారట.బెంగళూరులో ఎన్టీఆర్ రెండు పార్ట్లకు కలిపి 20 కోట్ల టార్గెట్ను పెట్టుకున్న నిర్మాతలు భారీ అంచనాల నడుమ అక్కడ ఎక్కువ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
ఓవర్సీస్ తెలుగు సినిమాకు రెండవ నైజాంగా పేరు దక్కించుకుంటే బెంగళూరు తెలుగు సినిమాలకు రెండవ సీడెడ్ ఏరియా అయ్యింది.అందుకే కర్ణాటకపై ఎక్కువ ఫోకస్ చేయాలని బాలయ్య అండ్ టీం భావించి అక్కడ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తెలుగు వర్షన్ను కర్ణాటకలో దాదాపుగా 150 థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు.