ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసింది.అయితే ఈ నేపథ్యంలో ఒకరి సినిమా ఫంక్షన్స్ కి మరొకరు హాజరుకావమేలేదు.
దీంతో నందమూరి అభిమానులంతా వీరు ఎప్పుడు కలుస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే ఆ ఆశ తీరిపోయే సమయం వచ్చేసింది.
అరవింద సమేత వీర రాఘవ` సక్సెస్ మీట్కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.ఆదివారం సాయింత్రం శిల్పారామంలో `అరవింద సమేత` విజయోత్సవం జరగబోతోంది.
బాలయ్య – ఎన్టీఆర్ – కల్యాణ్రామ్ ఒకే వేదికపై కనిపించడం.ఓ అరుదైన, అందమైన జ్ఞాపకమే.
బాబాయ్ ఈ ఫంక్షన్కి మీరే రావాల్సిందే` అంటూ కల్యాణ్ రామ్ బాగా పట్టుపట్టాడట.బాలయ్య ఇప్పుడు కల్యాణ్ రామ్ మాట కాదనలేడు.ఎందుకంటే `ఎన్టీఆర్`లో కల్యాణ్రామ్ హరికృష్ణలా నటించడానికి ఒప్పుకున్నాడు.దానికి తోడు.హరికృష్ణ మరణంతో కల్యాణ్రామ్,ఎన్టీఆర్ కుంగిపోయారు.వాళ్లకు అండగా ఉన్నా.
అన్న సంకేతం బాలయ్య మాత్రమే ఇవ్వగలడు.దానికి ఇంతకు మించిన తరుణం ఉండదు.
బాలకృష్ణ – ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్కి… ఈ సక్సెస్ మీట్ తెరదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.