ఒకే వేదికపై కనిపించబోతున్న ఎన్టీఆర్, బాలయ్య

ఎన్టీఆర్ బాలకృష్ణ మ‌ధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసింది.అయితే ఈ నేపథ్యంలో ఒకరి సినిమా ఫంక్షన్స్ కి మరొకరు హాజరుకావమేలేదు.

 Ntr Balayya Is Going To Be On The Same Platform-TeluguStop.com

దీంతో నందమూరి అభిమానులంతా వీరు ఎప్పుడు కలుస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే ఆ ఆశ తీరిపోయే సమయం వచ్చేసింది.

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` స‌క్సెస్ మీట్‌కి బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.ఆదివారం సాయింత్రం శిల్పారామంలో `అర‌వింద స‌మేత‌` విజ‌యోత్స‌వం జ‌ర‌గ‌బోతోంది.

బాల‌య్య – ఎన్టీఆర్ – క‌ల్యాణ్‌రామ్ ఒకే వేదిక‌పై క‌నిపించ‌డం.ఓ అరుదైన‌, అంద‌మైన జ్ఞాప‌క‌మే.

బాబాయ్ ఈ ఫంక్ష‌న్‌కి మీరే రావాల్సిందే` అంటూ క‌ల్యాణ్ రామ్ బాగా ప‌ట్టుప‌ట్టాడ‌ట‌.బాల‌య్య ఇప్పుడు క‌ల్యాణ్ రామ్ మాట కాద‌న‌లేడు.ఎందుకంటే `ఎన్టీఆర్‌`లో క‌ల్యాణ్‌రామ్ హ‌రికృష్ణ‌లా న‌టించ‌డానికి ఒప్పుకున్నాడు.దానికి తోడు.హ‌రికృష్ణ మ‌ర‌ణంతో క‌ల్యాణ్‌రామ్‌,ఎన్టీఆర్ కుంగిపోయారు.వాళ్ల‌కు అండ‌గా ఉన్నా.

అన్న సంకేతం బాల‌య్య మాత్రమే ఇవ్వ‌గ‌ల‌డు.దానికి ఇంత‌కు మించిన త‌రుణం ఉండ‌దు.

బాలకృష్ణ – ఎన్టీఆర్ మ‌ధ్య కోల్డ్ వార్‌కి… ఈ స‌క్సెస్ మీట్ తెర‌దించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube