నందమూరి బాలకృష్ణ, సౌందర్య, శ్రీకాంత్, శ్రీహరి, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో 16 సంవత్సరాల క్రితం బాలయ్య స్వీయ దర్శకత్వంలో అర్జునుడి పాత్రలో నటిస్తూ నర్తనశాల అనే సినిమా ప్రారంభమైంది.బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన నర్తనశాల నటి సౌందర్య మరణంతో ఆగిపోయింది.
ఆ తరువాత సినిమాలో భీముడి పాత్రలో నటించిన శ్రీహరి కూడా మరణించారు.బాలయ్య ఈ సినిమాను ఎప్పటికైనా పూర్తి చేయాలని అనుకున్నా కాలం మారే కొద్దీ పౌరాణిక చిత్రాలపై ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి తగ్గిపోతుంది.
దీంతో బాలకృష్ణ కొంత భాగం షూటింగ్ జరుపుకున్న నర్తనశాల సినిమాలోని సన్నివేశాలను 17 నిమిషాల వీడియోను శ్రేయాస్ ఈటీ ద్వారా ఏటీటీలో విడుదల చేయాలని సంకల్పించాడు.ఈ నెల 24వ తేదీన నర్తనశాల విడుదల కానుండగా ఈ మినీ సినిమాను కనీసం 50 రూపాయలు చెల్లించి చూసేలా నిర్ణయించారు.
టికెట్ కు గరిష్టం అంటూ రేటు ఫిక్స్ చేయలేదు.నర్తనశాల వసూళ్లను బసవతారకం ట్రస్ట్ కోసం వినియోగించనున్నారు. బాలకృష్ణ సినిమా వసూళ్లను మంచి పని కోసం వినియోగించుకోనుండటంతో కొందరు అభిమానులు లక్షల్లో చెల్లించి టికెట్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.అయితే పౌరాణిక చిత్రం, అందులోను 17 నిమిషాల వీడియోనే కావడంతో నర్తనశాలకు ఆశించిన స్థాయిలో హైప్ రాలేదు.
దీంతో శ్రేయాస్ ఏటీటీ ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ తో టికెట్ కొనిపించి సినిమాపై హైప్ పెంచాలని భావిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ తొలి టికెట్ కొంటే మాత్రం బాలయ్య సినిమాకు చాలా ప్లస్ అవుతుంది.
బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య విబేధాలు ఉన్నట్టు గతంలో అనేక సార్లు వార్తలు వచ్చినా ఎన్టీఆర్ మాత్రం బాలయ్యతో సత్సంబంధాలే ఉన్నాయని ఇంటర్వ్యూలో చెబుతున్నారు.మరి బాలయ్యకు సినిమా విషయంలో ఎన్టీఆర్ సాయం చేస్తారో లేదో చూడాల్సి ఉంది.