యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్లో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలోని తారక్ ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తారక్ పుట్టినరోజున (మే 20న) ఈ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.
కాగా తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తారక్ ఇప్పుడు బాలీవుడ్లో అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు.
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తారక్తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.తెలుగు చిత్రాల్లో తారక్ పర్ఫార్మెన్స్ను పలుమార్లు చూసి అవాక్కయిన భన్సాలీ, ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు చాలా ఆసక్తి చూపుతున్నాడట.
ఒక భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీలో తారక్ను విలన్గా పెట్టి సినిమా చేయడానికి భన్సాలీ రెడీ అవుతున్నాడట.రణ్వీర్ సింగ్ను హీరోగా పెట్టి తారక్ విలన్గా ఉంటే ఆ సినిమా ఓ రేంజ్లో ఉంటుందని, ఇది పాన్ ఇండియా మూవీగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడం ఖాయమని ఆయన భావిస్తున్నాడు.
తెలుగులో తారక్ నటించిన జై లవకుశ చిత్రంలో తారక్ విలన్ పాత్రకు భన్సాలీ చాలా ఇంప్రెస్ అయ్యాడట.అలాంటి పాత్రలో తారక్ తనలోని నటుడిని వందశాతం మనకు చూపిస్తాడని, అందుకే ఆయన్ను విలన్గా పెట్టి సినిమా చేయాలని భన్సాలీ అనుకుంటున్నాడు.
మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.ఇక భన్సాలీ సినిమా అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఏదేమైనా బాలీవుడ్లో తారక్ ఎంట్రీ ఇలాంటి సినిమాతో ఉంటే అదిరిపోతుందని నందమూరి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.