యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్ల కాంబినేషన్లో ఇప్పటికే అరవింద సమేత సినిమా వచ్చింది.ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
దాంతో మరోసారి ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఈసారి ఆయనకు మంచి హిట్ను అందించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.ఈ ఏడాది అల వైకుంఠపురంలో వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్తో సినిమాను చేయబోతున్నట్లుగా త్రివిక్రమ్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది.
అప్పటి నుండి వీరిద్దరి కాంబో మూవీ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటంతో పాటు రాజమౌళికి ఇచ్చిన మాట మేరకు మరే సినిమా షూటింగ్ లో కూడా హాజరు కావడం లేదు.
ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందో వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీని చేయబోతున్నట్లుగా ఎన్టీఆర్ ఇప్పటికే ప్రకటించాడు.
ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్లు ఈసారి అల వైకుంఠపురంలో వంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మూవీకి అయిననూ పోయి రావలే హస్తినకు అంటూ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను ప్రారంభించేందుకు గాను వచ్చే సమ్మర్ వరకు సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఒకింత అసహనంతో ఉన్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు ఏమీ చేయకుండా గమ్మున ఉన్నాడు.పొలిటికల్ డ్రామాగా ఎన్టీఆర్తో సినిమాను తీయాలని త్రివిక్రమ్ కథ రెడీ చేసి పెట్టుకున్నాడు.అల వైకుంఠపురంలో విడుదలై సంవత్సరం అయినా కూడా ఎన్టీఆర్తో మూవీ ప్రారంభించలేక పోతున్నాడు.
కరోనా వీరి ప్లానింగ్ను తలకిందులు చేసింది.కరోనా వచ్చి ఉండకుంటే ఇప్పటికే సగం వరకు షూటింగ్ పూర్తి అయ్యేది.
వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా వచ్చేది.