త్రివిక్రమ్ తో నా బ్యానర్ లో సినిమా అంటూ అగ్రనిర్మాత దిల్ రాజు చేసిన ప్రకటన అందరిని ఎంతగా ఉత్సాహాపరిచిందో, అదే రేంజిలో తికమకపెట్టింది.దానికి కారణం హీరో ఎవరో చెప్పకుండా దిల్ రాజు సగం సమాచారం మాత్రమే ఇవ్వడం.2014 సంవత్సరంలో దిల్ రాజు – త్రివిక్రమ్ మధ్య జరిగిన చర్చ ప్రకారమైతే హీరో ప్రభాస్.కాని ప్రభాస్ డేట్స్ అందుబాటులో లేవు ప్రస్తుతానికి.
బాహుబాలి పూర్తయిన వెంటనే, సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా , జిల్ ఫేమ్ రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయిపోయాడు ప్రభాస్.ఈ రెండు కూడా యువి క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతాయి.
ఇక త్రివిక్రమ్ – రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడో ఓకే అయిపోయింది.కాని దిల్ రాజు నిర్మించే సినిమా ఇదేనా కాదా అనేది తెలియదు.
అలాగే తెలుగుస్టాప్ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ కి కూడా ఓ కథ వినిపించారు త్రివిక్రమ్.దీన్నిబట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, త్రివిక్రమ్ తదుపరి సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పోటిలో ఉన్నారు.