యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వం లో ప్రస్తుతం దేవర అనే సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే.దేవర( Devara ) సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది.
దాంతో ఎన్టీఆర్ తదుపరి సినిమాల విషయం లో హడావుడి గా వ్యవహరించాల్సి వస్తుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంవత్సరం చివరి వరకు దేవర సినిమా యొక్క పనులతోనే ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉండబోతున్నాడు.ఆ తరువాత అంటే వచ్చే ఏడాది ఆరంభం నుండి కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neil ) దర్శకత్వం లో కొత్త సినిమా ను ప్రారంభించబోతున్నారు.ఆ సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుండి పూర్తయ్యే వరకు కంటిన్యూస్ గా షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబో సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2025 ఆరంభం లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక మరో విషయానికి వస్తే ఈ సినిమా లో బాలీవుడ్( Bollywood ) స్టార్ హీరోయిన్ నటించబోతుందట.ఆమె గతంలో కూడా తెలుగు లో నటించింది.కనుక ఈ సారి ఆమె నటిస్తే తప్పకుండా ఓ రేంజ్ లో సినిమాకు స్థాయి పెరుగుతుంది అనే టాక్ వినిపిస్తుంది.
మొత్తానికి ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా యొక్క స్థాయి పెరిగే విధంగా ముందు ముందు మరిన్ని వార్తలు వినిపించే అవకాశాలున్నాయి.ఇదే సమయం లో వార్ సినిమా షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు.
వచ్చే సంవత్సరం ప్రశాంత్ నీల్ సినిమా తో పాటు హిందీ వార్ 2 సినిమా( War 2 movie ) షూటింగ్ లో సమాంతరంగా ఎన్టీఆర్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.ఈ మధ్య కాలం లో ఎన్టీఆర్ మరియు ప్రముఖ దర్శకుడు చర్చలు కూడా జరిపారు.
కనుక ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా మరో సినిమా తో కూడా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చర్చలు జరుపుతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.