యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత రెండేళ్లుగా ఆర్ఆర్ఆర్ సినిమాతోనే బిజీగా ఉన్నారు.రాజమౌళితో సినిమా చేస్తున్న సమయంలో మరే దర్శకుడితో సినిమాను చేసే అవకాశం ఉండదు.
పూర్తిగా జక్కన్నకే డేట్లు కేటాయించాల్సి ఉంటుంది.అందుకు ఒప్పుకునే ఏళ్లకు ఏళ్లు హీరోలు రాజమౌళికి అప్పగిస్తున్నారు.
ఇప్పుడు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లు కూడా జక్కన్నకు రెండేళ్లుగా కేటాయించారు.కరోనా కారణంగా ఆ సమయం మరింత పెరిగింది.
ఎన్టీఆర్ ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేయాలని భావిస్తున్నాడు.అది కూడా ఇండస్ట్రీ హిట్లను అందుకున్న దర్శకులతో ఎన్టీఆర్ సినిమా చర్చలు జరుగుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.ఆ విషయమై మళ్లీ స్పష్టత అక్కర్లేదు.
ఎందుకంటే మార్చి నుండి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది అంటున్నారు. త్రివిక్రమ్ తర్వాత ప్రశాంత్ నీల్ లేదా అట్లీల దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఉంటుందని అంటున్నారు.
ఒకరి తర్వాత ఒకరు అట్లీ మరియు ప్రశాంత్ నీల్ల మూవీ ఉంటుంది.ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన వివరాలు వెళ్లడి అవ్వాల్సి ఉంది.ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న నాగ్ అశ్విన్ ఆ తర్వాత ఎన్టీఆర్తో సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు.
ప్రభాస్తో మూవీని 2022లో విడుదల చేస్తానంటున్న నాగ్ అశ్విన్ ఆ తర్వాత ఎన్టీఆర్తో మూవీని ఆ తర్వాత ఏడాది అంటే 2023లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.మొత్తానికి మూడేళ్లకు ముందే వీరి కాంబో ప్రాజెక్ట్కు సంబంధించిన చర్చలు జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్తో బాలీవుడ్ కాదు హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్తో సినిమాను చేస్తున్నట్లుగా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించాడు.ఆ సినిమా సక్సెస్ అయితే అంతకు మించి అన్నట్లుగా ఎన్టీఆర్ తో ఆయన సినిమా ఉంటుంది అంటున్నారు.