ఎన్టీఆర్ మరియు కొరటాల శివలు ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.త్వరలో వీరి కాంబోలో మరో సినిమా ను ప్రేక్షకులు చూడబోతున్నారు.
ఈసారి పాన్ ఇండియా మూవీగా వీరి కాంబో మూవీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పెద్ద ఎత్తున సినిమా చిత్రీకరణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సినిమా షూటింగ్ ప్రారంభంకు ముందే ఎన్టీఆర్ కొరటాల శివ ల కాంబో మూవీ కి సంబంధించిన టైటిల్ ను అధికారికంగా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు.అందుకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నారు.
ముఖ్యంగా ఈ సినిమా చిత్రీకరణ ముందు టైటిల్ ను ప్రకటించడం వల్ల సినిమా పై అంచనాలు పెంచే విధంగా టైటిల్ ఉంటుందని అంటున్నారు.
కొరటాల శివ గత చిత్రాలు చూస్తే కాస్త విభిన్నంగా ఉంటాయి.
మిర్చి మొదలుకుని ఆచార్య వరకు ఎన్నో సినిమా లు కూడా ఆయన నుండి వచ్చాయి.ఆయన షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత కొన్ని షూటింగ్ మొదలు పెట్టక ముందు కొన్ని సినిమాలకు సంబంధించిన చిత్రీకరణకు ముందే టైటిల్స్ ను ప్రకటించడం జరిగింది.
అందుకే ఎన్టీఆర్ మూవీ ప్రారంభంకు ముందే ప్రకటించేందుకు సిద్దం అయ్యాడు.కొరటాల శివ స్క్రిప్ట్ రాసుకున్న సమయంలోనే కథకు తగ్గట్లుగా టైటిల్ పై ఒక క్లారిటీకి వస్తాడు.
అందుకే ఎన్టీఆర్ మూవీ టైటిల్ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.అయిదు టైటిల్స్ ను ఇప్పటికే ఈ సినిమా కోసం అనుకున్నారు.
వాటిలో నుండి ఒక టైటిల్ ను త్వరలోనే ఎన్టీఆర్ ఖరారు చేయాల్సి ఉంది.అన్ని టైటిల్స్ కూడా పాన్ ఇండియా మూవీ కి తగ్గట్లుగా అంటే అన్ని భాషల్లో ఒకటే ఉండే విధంగా ఉంటాయని అంటున్నారు.
ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే విషయం పై జరుగుతున్న పుకార్లపై స్పష్టత రాలేదు.